మోమిన్కలాన్ ఏఈవోకు మెమో
ABN , First Publish Date - 2022-05-24T05:19:40+05:30 IST
మోమిన్కలాన్ ఏఈవోకు మెమో
ధారూరు, మే 23: విధులకు రాకుండా నిర్లక్ష్యం చేస్తున్న ఏఈవోకు మండల అధికారి మెమో జారీ చేశారు. అయితే దానికీ వివరణివ్వలేదని ఏవో జిల్లా అధికారుల దృష్టికి తీసికెళ్లారు. మోమిన్కలాన్ క్లస్టర్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ మల్లేశం విధులకు హాజరుకావటంలేదని రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. గత ఆగస్టు 8న రైతు వేదిక ప్రారంభం నుంచీ ఏఈవో వారానికో రోజు తప్ప రావడం లేదని, తమకు అవగహనకల్పించటం లేదని రైతులు ఏవో జ్యోతికి ఫిర్యాదు చేశారు. దీంతో ఏఈవో మల్లేశానికి ఏఓ మెమో జారీ చేసినా జవాబు ఇవ్వలేదు. దీంతో ఏఓ విషయాన్ని డీఏవో దృష్టికి తీసుకెళ్లారు. రైతు వేదికలో విధులు నిర్వహించాలని డీఏవో గోపాల్ ఏఈవోను ఆదేశించారు. ఇదిలా ఉంటే సోమవారం రైతు వేదికను ఓ బాలుడితో శుభ్రం చేయించారని, ఇది సరికాదని గ్రామస్తులు పేర్కొన్నారు.