మైసిగండి ఆలయ హుండీ లెక్కింపు
ABN , First Publish Date - 2022-08-23T04:35:44+05:30 IST
కడ్తాల మండలం మైసిగండి మైసమ్మ దేవాలయం వద్ద సోమవారం
కడ్తాల్, ఆగస్టు 22: కడ్తాల మండలం మైసిగండి మైసమ్మ దేవాలయం వద్ద సోమవారం హుండీ ఆదా యం లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ఫౌండర్ ట్రస్టీ రామావత్ సిరోలి పంతూ, జిల్లా దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ప్రణీత్కుమార్, ఆలయ ఈవో స్నేహలత పర్యవేక్షణలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. 50 రోజులకుగాను హుండీ ఆదాయం రూ. 10,47, 700 లభించినట్లు ఈవో స్నేహలత తెలిపారు. హుండీ ఆదాయం డబ్బును ఆలయ బ్యాంకు ఖాతాలో జమచేసి భక్తుల సౌకర్యాల కల్పనకు ఖర్చు చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు ఆర్.పి భాస్కర్, అరుణ్, ప్రధానఅర్చకుడు యాదగిరి, సిబ్బంది బోడ్యనాయక్, కృష్ణ, చంద్రయ్య, రాములు, దేవేందర్, రమాదేవి, శ్రీనివాసులు, వెంకటేశ్, కృష్ణయ్య, హర్షవర్ధన్ రెడ్డి, రామకృష్ణ, తదితరులు ఉన్నారు.