కనులపండువగా మహా సుదర్శన నారసింహ హోమం

ABN , First Publish Date - 2022-12-25T23:32:24+05:30 IST

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మేడ్చల్‌ మండలం డబిల్‌పూర్‌ ఇస్కాన్‌ టెంపుల్‌లో ఆదివారం నిర్వహించిన మహా సుదర్శన నారసింహ హోమంలో గవర్నర్‌ తమిళిసై పాల్గొన్నారు.

 కనులపండువగా మహా సుదర్శన నారసింహ హోమం
పూజలో పాల్గొన్న గవర్నర్‌ తమిళిసై

పాల్గొన్న గవర్నర్‌ తమిళిసై, బీజేపీ మాజీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మేడ్చల్‌ మండలం డబిల్‌పూర్‌ ఇస్కాన్‌ టెంపుల్‌లో పూజలు

మేడ్చల్‌, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మేడ్చల్‌ మండలం డబిల్‌పూర్‌ ఇస్కాన్‌ టెంపుల్‌లో ఆదివారం నిర్వహించిన మహా సుదర్శన నారసింహ హోమంలో గవర్నర్‌ తమిళిసై పాల్గొన్నారు. ఈమేరకు గవర్నర్‌కు వేదపండితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అలయ ప్రాంగణంలో నిర్వహించిన మహా సుదర్శన నరసింహ హోమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని గవర్నర్‌ ఈసందర్భంగా తెలిపారు. తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. మొదటిసారిగా ఇస్కాన్‌ టెంపుల్‌కు రావడం సంతోషంగా ఉందన్నారు. కాగా, తాను గవర్నర్‌గా రాలేదని, ఓ భక్తురాలిగా ఇక్కడికి వచ్చానని అన్నారు. కరోనా సమయంలో ఇస్కాన్‌ సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ జాతీయ కార్యదర్శి, మధ్యప్రదేశ్‌ ఇన్‌చార్జి మురళీధర్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రంరెడ్డి, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-25T23:32:26+05:30 IST