నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పని చేయాలి

ABN , First Publish Date - 2022-12-06T23:57:36+05:30 IST

పార్టీ కోసం నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు.

నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పని చేయాలి

పరిగి రూరల్‌, డిసెంబరు 6: పార్టీ కోసం నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కాళ్లపూర్‌ గ్రామాన్ని సందర్శించి లొంక ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు కె.అనిల్‌రెడ్డి, ఎంపీపీ అరవింద్‌రావు, జడ్పీటీసీ హరిప్రియరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ అశోక్‌కుమార్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ శ్యాంసుందర్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ భాస్కర్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ఆంజనేయులు, నాయకులు ప్రవీణ్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T23:57:37+05:30 IST