కత్తితో దాడి.. వ్యక్తికి గాయాలు
ABN , First Publish Date - 2022-07-01T06:17:30+05:30 IST
కత్తితో దాడి.. వ్యక్తికి గాయాలు
కొత్తూర్, జూన్ 30: మద్యం మత్తులో కత్తితో దాడి చేసిన ఘటనలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన కొత్తూర్ పోలీ్సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కొత్తూర్ పరిధి వైఎంతండా పంచాయతీలోని పులిచర్లకుంట తండాకు చెందిన దశరథ్, అదే తండాకు చెందిన పాత్లావత్ తుల్సనాయక్లు కలిసి బుధవారం మద్యం తాగారు. సాయంత్రం ఇరువురి మధ్య మాటామాటా పెరగడంతో తుల్సనాయక్ కత్తితీసుకుని దశరథ్పై దాడిచేశాడు. ఈ దాడిలో దశరథ్ తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దశరథ్ కొడుకు మెహన్నాయక్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శంకర్ తెలిపారు.