టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిక
ABN , First Publish Date - 2022-07-01T06:32:44+05:30 IST
టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిక
పూడూర్, జూన్ 30 : పూడూర్ మండలానికి చెందిన 300 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్, పూడూర్ మండలాధ్యక్షుడు అనిల్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈమేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో గురువారం హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో పార్టీలో చేరగా.. వారికి బండి సంజయ్ బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.