దళితబంధు దేశానికే ఆదర్శం : పట్నం
ABN , First Publish Date - 2022-07-01T05:30:00+05:30 IST
దళితబంధు దేశానికే ఆదర్శం : పట్నం
షాబాద్, జూలై 1 : దళితబంధు దేశానికే ఆదర్శమని జడ్పీటీసీ సభ్యుడు పట్నం అవినా్షరెడ్డి అన్నారు. శుక్రవారం లింగారెడ్డిగూడ గ్రామానికి చెందిన అనురాధకు దళితబంధు పథకం కింద మంజూరైన ట్రాక్టర్ను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుపేదల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాలు, విద్యార్థులు, మహిళలు అన్నివర్గాల అభివృద్ధికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని సంక్షేమ పథకాల పేరుతో అందిస్తూ గ్రామాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సింహారెడ్డి, శేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.