చేవెళ్ల ఎంపీడీవోగా హిమబిందు
ABN , First Publish Date - 2022-11-15T00:27:34+05:30 IST
చేవెళ్ల మండల ఎంపీడీవోగా నూతనంగా హిమబిందు నియమితులయ్యారు.
చేవెళ్ల, నవంబరు 14: చేవెళ్ల మండల ఎంపీడీవోగా నూతనంగా హిమబిందు నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ఆమె చేవెళ్ల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టారు. జనగాం మండల అభివృద్ధికి ఆమె పనిచేశారు. అక్కడి నుంచి చేవెళ్ల మండల అభివృద్ధి అధికారిగా ప్రభుత్వం బదిలీ చేసింది. గత పది నెలల నుంచి ఇన్చార్జి ఎంపీడీవోగా రాజ్కుమార్ కొనసాగారు. బాధ్యతలు స్వీకరించిన ఎంపీడీవో హిమబిందును చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి అధికారులతో కలిసి అభినందనలు తెలిపారు.