సమస్యల పరిష్కారానికే ‘శుభోదయం’

ABN , First Publish Date - 2022-11-12T00:10:24+05:30 IST

గ్రామాల్లో సమస్యల పరిష్కారానికే శుభోదయం కార్యక్రమాన్ని చేపట్టినట్లు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు.

సమస్యల పరిష్కారానికే ‘శుభోదయం’
సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే

శంకర్‌పల్లి నవంబరు 11: గ్రామాల్లో సమస్యల పరిష్కారానికే శుభోదయం కార్యక్రమాన్ని చేపట్టినట్లు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. మండలంలోని మహాలింగాపురం, బయన్నగూడ గ్రామాల్లో శుక్రవారం ఆయన పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ గోపాల్‌రెడ్డి, సర్పంచులు మాణిక్యరెడ్డి, నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌, ఎంపీటీసీ యాదగిరి, టీఆర్‌ఎస్‌ నాయకులు గోపాల్‌, రాఘవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-11-12T00:10:25+05:30 IST