ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

ABN , First Publish Date - 2022-12-16T23:11:27+05:30 IST

దుబాయ్‌ నుంచి అక్రమంగా తీసుకొస్తున్న బంగారాన్ని ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు.

ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత
స్వాధీనం చేసుకున్న గోల్డ్‌

శంషాబాద్‌రూరల్‌, డిసెంబరు 16: దుబాయ్‌ నుంచి అక్రమంగా తీసుకొస్తున్న బంగారాన్ని ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్‌ నుంచి 6ఈ-025 విమానంలో వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలు శుక్రవారం తెల్లవారుజామున శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. కస్టమ్స్‌ అధికారులు ఆమె బ్యాగులు తనిఖీ చేయగా 955గ్రాముల బంగారం ఉన్నట్లు గుర్తించారు. దానికి సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో మహిళను అదుపులోకి తీసుకుని బంగారాన్ని సీజ్‌ చేశారు. బంగారం విలువ రూ.46.53లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్‌ అధికారులు వెల్లడించారు. సదరు మహిళను హైదరాబాద్‌లోని కస్టమ్స్‌ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు.

Updated Date - 2022-12-16T23:11:29+05:30 IST