కులవృత్తుల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట: ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2022-08-20T05:40:01+05:30 IST
కులవృత్తుల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట: ఎమ్మెల్యే
కడ్తాల్, ఆగస్టు 19: రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తుల సంక్షేమం, ఆర్థికాభివృద్దికి పెద్దపీట వేస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్యాదవ్ అన్నారు. కడ్తాల మండలానికి చెందిన పలువురు కులవృత్తుల సంఘం నాయకులతో శుక్రవారం ఎమ్మెల్యే జైపాల్యాదవ్ నగరంలోని తన నివాసంలో సమావేశమయ్యారు. కడ్తాలలో యాదవ సంఘం భవననిర్మాణానికి నిధులు కేటాయించాలని సర్పంచ్ గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి ఎమ్మెల్యే జైపాల్యాదవ్కు వినతిపత్రం అందజేశారు. కడ్తాలలో యాదవసంఘం, ఎక్వాయిపల్లిలో గీతాకార్మిక భవనాల నిర్మాణానికి రూ.10లక్షల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆమనగల్లు నిట్ట నారాయణ, జోగు వీరయ్య, తోట గిరియాదవ్, జైపాల్రెడ్డి, యాదిరెడ్డి పాల్గొన్నారు.