వీఆర్‌ఏల ధర్నా

ABN , First Publish Date - 2022-07-01T06:15:13+05:30 IST

వీఆర్‌ఏల ధర్నా

వీఆర్‌ఏల ధర్నా

కొత్తూర్‌/చౌదరిగూడ/శంషాబాద్‌, జూన్‌ 30: పేస్కేల్‌ జీవోను వెంటనే అమలు చేయాలని కోరుతూ వీఆర్‌ఏలు స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్‌ వెంకట్‌రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో వీఆర్‌ఏల సంఘం అధ్యక్షుడు హరినాథ్‌, వీఆర్‌ఏలు భాస్కర్‌, భానుచందర్‌, శేఖర్‌, జంగమ్మ, కుమార్‌, రాంచంద్రయ్యలు పాల్గొన్నారు. అదేవిధంగా చౌదరిగూడలో వీఆర్‌ఏలు ధర్నా చేసి తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. శంషాబాద్‌లో మండల అధ్యఓఉడు జానకీరాం ఆధ్వర్యంలో మండల తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. 

Updated Date - 2022-07-01T06:15:13+05:30 IST