దళితబంధును సద్వినియోగం చేసుకోవాలి
ABN , First Publish Date - 2022-08-31T05:51:04+05:30 IST
దళితబంధును సద్వినియోగం చేసుకోవాలి
చేవెళ్ల, ఆగస్టు 30 : దళితబంధు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం దామరిగిద్ద గ్రామానికి చెందిన దాస్కు దళితబంధు కింద గేదెలను అందశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎంిపీడీవో రాజ్కుమార్, ప్రభాకర్, ఎల్లయ్య, సీనియర్ నాయకులు నర్సింలు (చింటు), కృష్ణ, గని, తదితరులు ఉన్నారు.