ఆధునిక పద్ధతులతో పత్తిసాగు లాభదాయకం
ABN , First Publish Date - 2022-05-24T05:49:27+05:30 IST
ఆధునిక పద్ధతులతో పత్తిసాగు లాభదాయకం
ఆమనగల్లు, మే 23: ఆధునిక పద్ధతుల ద్వారా సేద్యం చేయడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి అన్నారు. మండలంలోని రాంనుంతల రైతు వేదికలో సోమవారం పత్తిసాగులో సాంద్రత పద్ధతిపై ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల మండలాల వ్యవసాయ శాఖ అధికారులకు అవగాహన కల్పించారు. ఆమనగల్లు ఏవో అరుణకుమారి అధ్యక్షతన జరిగిన సమావేశానికి డీఏవో గీతారెడ్డి, శాస్త్రవేత్తలు రామకృష్ణ, ప్రవీణ్, ఏడీఏ లు సుజాత, సత్యనారాయణ, రాశి సీడ్స్ డీఎం నవీన్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గీతారెడ్డి మాట్లాడుతూ వానాకాలం పంటల సాగుకు జిల్లాలో సమగ్ర వ్యవసాయ ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. సాంద్రత పద్ధతిలో పత్తిసాగు అన్నదాతలకు అన్ని విధాలా లాభదాయకమన్నారు. సమావేశంలో ఏవో లు అరుణకుమారి, శ్రీలత, రాజు, గౌతమ్ పాల్గొన్నారు.