సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం
ABN , First Publish Date - 2022-09-12T05:08:44+05:30 IST
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం
మేడ్చల్, సెప్టెంబరు 11 : సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు ఒక వరమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపల్ 23వ వార్డుకు చెందిన కౌడే సత్తయ్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సీఎం రిలీప్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ. లక్ష చెక్కును ఆదివారం మంత్రి చేతులమీదుగా లబ్దిదారుడికి అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కౌడే మహేష్, నాయకులు నర్సింహ్మారెడ్డి, సందీ్పగౌడ్, భాస్కర్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.