రాష్ట్రాభివృద్ధికి సీఎం సాహసోపేత నిర్ణయాలు
ABN , First Publish Date - 2022-03-05T05:30:00+05:30 IST
రాష్ట్రాభివృద్ధికి సీఎం సాహసోపేత నిర్ణయాలు
ఆమనగల్లు, మార్చి 5: రాష్ట్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. పట్టణానికి చెందిన పలువురు లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే నగరంలోని తన నివాసంలో శనివారం అందజేశారు. కోట సదానందంకు రూ.1.75లక్షలు, మేడిగడ్డకు చెందిన తావుకు రూ.32వేలు, ఖానాపూర్కు చెందిన బాలమణికి రూ.26వేలు, పి.కొండల్రెడ్డికి రూ.55వేలు, బల్సులపల్లికి చెందిన పురుషోత్తంకు రూ.22 వేలు, కడ్తాల మండలం చల్లంపల్లికి చెందిన యాదయ్యకు రూ.60వేలు, జేపీనగర్కు చెందిన మల్లేశ్కు రూ.3లక్షలు విలువ గల చెక్కులను అందజేశారు. అదేవిధంగా కడ్తాల మండలంలోని వంపుగూడకు చెందిన భారతమ్మకు రూ.28,500లు, మాడ్గులకు చెందిన అలివేలుకు రూ.14వేలు విలువ గల చెక్కులను అందించారు. ఆయా కార్యక్రమాల్లో నాలాపురం శ్రీనివా్సగౌడ్, తోట గిరియాదవ్, పత్యానాయక్, రాజేందర్గౌడ్, రవీందర్ నాయక్, పంతూనాయక్, సోనశ్రీను నాయక్, వెంకట్రామ్రెడ్డి, అంజయ్యగౌడ్, యాదయ్యగౌడ్, దారెడ్డి అంజన్ రెడ్డి, కోట రాఘవేందర్, గణేశ్గుప్త, విజయ్రాథోడ్ పాల్గొన్నారు.