క్యాబ్‌ డ్రైవర్‌ అదృశ్యం

ABN , First Publish Date - 2022-12-07T00:03:31+05:30 IST

క్యాబ్‌ డ్రైవర్‌ అదృశ్యమైన ఘటన చేవెళ్ల పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

క్యాబ్‌ డ్రైవర్‌ అదృశ్యం

చేవెళ్ల, డిసెంబరు 6: క్యాబ్‌ డ్రైవర్‌ అదృశ్యమైన ఘటన చేవెళ్ల పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని మీర్‌పేట్‌కు చెందిన మునావత్‌ అశోక్‌(28సంవత్సరాలు) వృత్తిరీత్యా వోలా కారు డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలాగే ఈనెల 5వ తేదీన ఉదయం ఇంటి నుంచి వోలా కారులో బయటకు వెళ్లాడు. అయితే రాత్రి 9గంటలకు అతడి భార్య సునీత ఫోన్‌ చేయగా బోయిన్‌పల్లి నుంచి చేవెళ్ల వరకు కస్టమర్‌తో వచ్చానని చెప్పాడు. తిరిగి రాత్రి 11గంటలైనా ఇంటికి రాకపోవడంతో భార్య మళ్లీ ఫోన్‌ చేయగా అశోక్‌ ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ వచ్చింది. అప్పటి నుంచి ఎంత ప్రయత్నించినా అశోక్‌ ఆచూకీ లభించలేదు. దీంతో సునీత మంగళవారం ఉదయం చేవెళ్ల పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చేవెళ్ల ఎస్‌ఐ ప్రదీప్‌ తెలిపారు.

Updated Date - 2022-12-07T00:03:32+05:30 IST