Rangareddy Dist.: గురునానక్ కాలేజ్‌లో ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2022-11-06T09:56:31+05:30 IST

ఇబ్రహీంపట్నంలోని గురునానక్ కాలేజ్‌లో బీటెక్ చదువుతున్న విద్యార్థి వంశీ పటేల్ నాలుగు రోజుల క్రితం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే.

Rangareddy Dist.: గురునానక్ కాలేజ్‌లో ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థి మృతి

రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నంలోని గురునానక్ కాలేజ్‌లో బీటెక్ చదువుతున్న విద్యార్థి వంశీ పటేల్ నాలుగు రోజుల క్రితం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. కాంచన బాగ్ అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించాడు. ఈ సంఘటన చాలా దురదృష్టకరం. గురు నానక్ కాలేజీలో తరచుగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. దీనిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఇబ్రహీంపట్నం, గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థి వంశీ పటేల్ (23) సీఎస్ఈ మూడవ సంవత్సరం చదువుతున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు ప్రయత్నించడానికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు.

Updated Date - 2022-11-06T09:56:36+05:30 IST