ఐటీ దాడులతో రాజకీయ లబ్ధికి బీజేపీ యత్నం

ABN , First Publish Date - 2022-11-23T23:34:04+05:30 IST

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని రాజకీయ లబ్ధికి యత్నిస్తుందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆరోపించారు.

ఐటీ దాడులతో రాజకీయ లబ్ధికి బీజేపీ యత్నం
పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పుతున్న ఎమ్మెల్సీ

ఆమనగల్లు, నవంబరు 23: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని రాజకీయ లబ్ధికి యత్నిస్తుందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆరోపించారు. ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు అందులో భాగమేనని ఆయన పేర్కొన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు బుధవారం ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఆద్వర్యంలో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈసందర్భంగా కసిరెడ్డి మాట్లాడారు. తెలంగాణ పట్ల ఉద్దేశ పూర్వకంగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతలు విషం కక్కుతూ నిధుల కేటాయింపులో వివక్ష చూపుతుందన్నారు. ప్రజాక్షేత్రంలో బీజేపీకి తగిన శిక్ష తప్పదని ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో రామకృష్ణ, మతృనాయక్‌, రవి, పాండు, భీమ్లా, శ్రీను, బుజ్జి, లక్ష్మణ్‌, సీత్యనాయక్‌, లక్ష్మణ్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-23T23:34:05+05:30 IST