బీమా చేయించుకొని ధీమాగా ఉండాలి
ABN , First Publish Date - 2022-09-10T06:00:43+05:30 IST
బీమా చేయించుకొని ధీమాగా ఉండాలి
షాబాద్, సెప్టెంబర్ 9: ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి జీవన్జ్యోతి, ప్రధాన మంత్రి సురక్ష బీమాను చేయించుకొని ధీమాగా ఉండాలని కుమ్మరిగూడ సర్పంచ్ పొనమోని కేతన రమేష్ అన్నారు. మండలంలోని కుమ్మరిగూడలో శుక్రవారం గ్రామస్థులకు బీమాపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ ఫరూక్, ఎస్బీఐ సీఎప్పీ నిర్వాహకులు నవనీతశివరాజ్గౌడ్, గ్రామస్థులు ఉన్నారు.