రైతులకు పంటలపై అవగాహన
ABN , First Publish Date - 2022-07-01T06:16:24+05:30 IST
రైతులకు పంటలపై అవగాహన
ఆమనగల్లు/మంచాల, జూన్ 30: మండల పరిధిలోని చింతలపల్లి లో గురువారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పత్తి, కంది పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏవో అరుణకుమారి అధ్యక్షతన జరిగిన అవగాహన సదస్సులో సర్పంచ్ మంజుల యాదయ్య పాల్గొన్నారు. మంచాలలో ఎంపీపీ జాటోత్నర్మద పత్తిసాగు నూతన వ్యవసాయ విధానానికి సంబందించి మంచాల మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు. గురువారం ఆరుట్లలో న్యూమరిక్ ప్లాంటర్ ద్వారా రైతుల పొలాల్లో క్షేత్ర ప్రదర్శన ఏర్పాటుచేశారు.