ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సన్మానం
ABN , First Publish Date - 2022-07-01T05:30:00+05:30 IST
ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సన్మానం
చేవెళ్ల/కడ్తాల్, జూలై 1: అంతారంలో జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతిలో ప్రతిభ చాటిన విద్యార్థులను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కావలి వెంకటేశ్ శుక్రవారం సన్మానించారు. ప్రతిభ కనబరిచిన వడ్ల శ్రీవాణికి రూ.5వేలు, భరత్కుమార్కు రూ.3వేలు ప్రోత్సాహకంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సుజాత, హెచ్ఎం మల్లేశం, ఉపాధ్యాయులు మాణిక్రావు, నర్సింలు, హతీరం, మున్ని హని ఉన్నారు. అదేవిధంగా కడ్తాల్ మండల కేంద్రంలోని ప్రగతి ఉన్నత పాఠశాలలో పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను శుక్రవారం కరస్పాండెంట్ సువర్ణగోవర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో సత్కరించారు.