కుల వృత్తులకు పూర్వవైభవం

ABN , First Publish Date - 2022-12-02T00:14:07+05:30 IST

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాకే కులవృత్తులకు పూర్వవైభవం ఏర్పడిందని ఆమనగల్లు మార్కెట్‌ చైర్మన్‌ నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.

కుల వృత్తులకు పూర్వవైభవం
భవన నిర్మాణ పనులను ప్రారంభిస్తున్న శ్రీనివా్‌సరెడ్డి

తలకొండపల్లి, డిసెంబరు 1: రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాకే కులవృత్తులకు పూర్వవైభవం ఏర్పడిందని ఆమనగల్లు మార్కెట్‌ చైర్మన్‌ నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. చుక్కాపూర్‌లో ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.5లక్షలతో చేపట్టిన యాదవ సంఘం భవన నిర్మాణ పనులను గురువారం స్థానిక నాయకులతో కలిసి శ్రీనివా్‌సరెడ్డి ప్రారంభించారు. కులవృత్తుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. గ్రామాల్లో కమ్యూనిటీ హాల్‌లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ డైరెక్టర్‌ వెంకట్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుమ్మకొండ మల్లారెడ్డి, నాయకులు పర్వతాలు, శ్రీశైలం, మల్లేశ్‌, యాదయ్య, చెన్నయ్య, వార్డుసభ్యులు శ్రీను, బీష్మాచారి, వీరయ్య, కృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-02T00:14:08+05:30 IST