అర్హులందరూ ఓటు హక్కు కలిగి ఉండాలి
ABN , First Publish Date - 2022-12-06T23:59:33+05:30 IST
అర్హత గల ప్రతీ ఒక్కరు ఓటు హక్కు కలిగి ఉండాలని స్వీప్ (సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) నోడల్ అధికారి కోటాజీ అన్నారు.
వికారాబాద్, డిసెంబరు 6 : అర్హత గల ప్రతీ ఒక్కరు ఓటు హక్కు కలిగి ఉండాలని స్వీప్ (సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) నోడల్ అధికారి కోటాజీ అన్నారు. మంగళవారం స్థానిక ఎస్ఏపీ డిగ్రీ కళాశాలలో ఓటరు నమోదుపై స్వీప్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పెషల్ సమ్మరి రివిజన్-2023లో భాగంగా ఈ నెల 8వ తేదీ వరకు 18 సంవత్సరాల వయస్సు పూర్తయిన విద్యార్థినీవిద్యార్థులు తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా ఓటరు కార్డుకు ఆధార్ కార్డు అనుసంధానం, మార్పులు, చేర్పులు, మృతిచెందిన వారి పేర్లు ఓటరు లిస్టు నుంచి తొలగింపు, తదితర విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఏపీ కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బందితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.