కార్యకర్తలకు కాంగ్రెస్‌లో తగిన గుర్తింపు

ABN , First Publish Date - 2022-11-28T00:13:38+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీలో కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని షాద్‌నగర్‌ సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు వీర్లపల్లి శంకర్‌ అన్నారు.

కార్యకర్తలకు కాంగ్రెస్‌లో తగిన గుర్తింపు
చంద్రశేఖర్‌కు నియామకపత్రం అందజేస్తున్న వీర్లపల్లి శంకర్‌

షాద్‌నగర్‌అర్బన్‌, నవంబరు 27: కాంగ్రెస్‌ పార్టీలో కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని షాద్‌నగర్‌ సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు వీర్లపల్లి శంకర్‌ అన్నారు. తెలంగాణ ప్రదేశ్‌ కమిటీ ఓబీసీ సెల్‌ షాద్‌నగర్‌ నియోజకవర్గం అధ్యక్షుడిగా జాకారం గ్రామానికి చెందిన నాయనోనిపల్లి చంద్రశేఖర్‌ను రెండవ సారి నియమించారు. ఈమేరకు షాద్‌నగర్‌ కాంగ్రెస్‌ పార్టీ క్యాంపు ఆఫీసులో ఆదివారం చంద్రశేఖర్‌ను సన్మానించి, నియామకపత్రాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు బాబర్‌ఖాన్‌, జి. బాల్‌రాజ్‌గౌడ్‌, కృష్ణారెడ్డి, రాజు, మొగులయ్య సత్యంరెడ్డి, అశోక్‌, వెంకటేష్‌, మోహన్‌ పాల్గొన్నారు.

చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యం

కొందుర్గు: విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమని షాద్‌నగర్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి వీర్లపల్లి శంకర్‌ అన్నారు. మండల కేంద్రంలో మాస్టర్‌ మెహారాజ్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన 38వ ఆల్‌స్టైల్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ గుంగ్‌ఫూ, కరాటే పోటీలను శంకర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ నాయకులు బాబార్‌ఖాన్‌, పార్టీ మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి, రాజు, మండల మహిళా అధ్యక్షురాలు వజ్రమ్మ, రజిత, పురుషోత్తంరెడ్డి, జితేందర్‌రెడ్డి, నరేందర్‌, మల్లే్‌షగౌడ్‌, శేఖర్‌, ఎంపీటీసీ సత్యనారాయణరెడ్డి, కిసాన్‌ కాంగ్రెస్‌ సెల్‌ అధ్యక్షుడు వెంకట్‌నర్సింహారెడ్డి, మోహన్‌, మొగులయ్య, అశోక్‌, నర్సింలు, యాదయ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-11-28T00:13:39+05:30 IST