గొంతులో లివర్‌ ముక్క ఇరుక్కొని వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-11-15T00:29:09+05:30 IST

భోజనం చేస్తుండగా గొంతులో లివర్‌ ముక్క ఇరుక్కొని ఓ వ్యక్తి మృతిచెందాడు.

గొంతులో లివర్‌ ముక్క ఇరుక్కొని వ్యక్తి మృతి

చేవెళ్ల, నవంబరు 14: భోజనం చేస్తుండగా గొంతులో లివర్‌ ముక్క ఇరుక్కొని ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన చేవెళ్ల పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ హయూబ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నుల్‌ జిల్లాకు చెందిన లింగస్వామి(46) అతడి భార్య పార్వతమ్మతో కలిసి బతుకు దెరువు కోసం గతేడాది చేవెళ్ల పట్టణ కేంద్రానికి వచ్చారు. చేవెళ్లలోనే గుడిసెలు వేసుకుని కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఆదివారం రాత్రి చికెన్‌తో పాటు లివర్‌ కొనుగోలు చేసి వారు ఉంటున్న గుడిసేలోనే వండుకుని భార్యభర్తలు భోజనం చేస్తున్నారు. ఈ క్రమంలో లింగస్వామికి గొంతులో లివర్‌ ముక్క ఇరుక్కుంది. దీంతో వెంటనే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ పరిస్థితి విషమించడంతో నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. లింగస్వామి అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2022-11-15T00:29:10+05:30 IST