10th class: టెన్త్‌లో 6 పేపర్లే.. జీవో విడుదల చేసిన ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-12-31T16:38:31+05:30 IST

ఇటీవల పదో తరగతి (10th class) వార్షిక పరీక్షలను ఆరు పేపర్లతోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టెన్త్‌ వార్షిక పరీక్షలు ఆరు పేపర్లకు కుదిస్తూ..

10th class: టెన్త్‌లో 6 పేపర్లే.. జీవో విడుదల చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌: ఇటీవల పదో తరగతి (10th class) వార్షిక పరీక్షలను ఆరు పేపర్లతోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టెన్త్‌ వార్షిక పరీక్షలు ఆరు పేపర్లకు కుదిస్తూ.. శనివారం తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) జీవో విడుదల చేసింది. గతంలో టెన్త్‌ వార్షిక పరీక్షలను 11 పేపర్లతో నిర్వహించే వారు. అయితే కరోనా సమయంలో 6 పేపర్లకు కుదించారు. దాంతో పాటు 70 శాతం సిలబస్‌ (Syllabus)నే అమలుపరిచారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా భయం పూర్తిగా తొలగిపోయింది. ప్రస్తుత విద్యా సంవత్సరం కూడా సాఫీగానే కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో మళ్లీ పాత విధానం అమలవుతుందని భావించారు. అయితే ప్రభుత్వం మాత్రం 100 శాతం సిలబ్‌సతో 6 పేపర్ల విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. విద్యార్థులపై భారాన్ని తగ్గించడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఏప్రిల్‌ 3 నుంచి టెన్త్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.

Updated Date - 2022-12-31T16:46:51+05:30 IST