విద్యుత్‌ షాక్‌తో యువకుడి మృతి

ABN , First Publish Date - 2022-12-07T00:26:11+05:30 IST

తగ్గేల్లి గ్రామంలో మంగళవారం విద్యుత్‌ షాక్‌కు గురై ఆకాష్‌ (18) మృతి చెందాడు. బోధన్‌ రూరల్‌ ఎస్సై సందీప్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో ఇంటి స్లాబ్‌ కోసం సెంట్రింగ్‌ కొడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందినట్లు తెలిపారు.

విద్యుత్‌ షాక్‌తో యువకుడి మృతి

బోధన్‌ రూరల్‌, డిసెంబరు6: తగ్గేల్లి గ్రామంలో మంగళవారం విద్యుత్‌ షాక్‌కు గురై ఆకాష్‌ (18) మృతి చెందాడు. బోధన్‌ రూరల్‌ ఎస్సై సందీప్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో ఇంటి స్లాబ్‌ కోసం సెంట్రింగ్‌ కొడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని బోధన్‌ ఆసుపత్రికి తరలించామన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నామన్నాడు. మృతుడు మహారాష్ట్రలోని ఎస్గికి చెందిన వాడని తెలిపారు.

Updated Date - 2022-12-07T00:26:13+05:30 IST