అక్రమంగా మొరం తవ్విన వ్యక్తికి జరిమానా

ABN , First Publish Date - 2022-11-30T00:24:26+05:30 IST

భూగర్భ శాఖ ద్వారా అనుమతులు లేకుండా అ క్రమంగా మొరం తవ్విన వ్యక్తికి ఆ శాఖాధికారులు రూ.35లక్షల 48వేల 655 జరిమానా విధిస్తూ నోటీసు జారీ చేశారు. నందిపేట మండలం లక్కంపల్లి గ్రామ శివారు వద్ద గల సర్వే నంబర్‌ 189భూమిలో జేసీబీ ద్వారా అక్రమంగా మొరం తవ్వకాలను పి.రాజు(సోడల రాజు)అనే వ్యక్తి చేస్తున్నాడని వీడీసీ సభ్యులు అక్టోబరు 28న ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. రెవెన్యూ, భూగర్భ శాఖాధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి అక్రమ మొరం తవ్వకాలు జరుపుతున్నట్లు పంచనామా చేశారు. అ నంతరం నవంబరు 10న సోడాల రాజుకు అధికారులు నోటీసులు జారీ చేశారు. గ డుపు లోపు సమాధానం ఇవ్వనందున జరిమానాను 15 రోజుల లోపు చెల్లించాల్సిందిగా నోటీసులు జారీ చేశారు.

అక్రమంగా మొరం తవ్విన వ్యక్తికి జరిమానా

నందిపేట్‌/ఖిల్లా, నవంబరు 29: భూగర్భ శాఖ ద్వారా అనుమతులు లేకుండా అ క్రమంగా మొరం తవ్విన వ్యక్తికి ఆ శాఖాధికారులు రూ.35లక్షల 48వేల 655 జరిమానా విధిస్తూ నోటీసు జారీ చేశారు. నందిపేట మండలం లక్కంపల్లి గ్రామ శివారు వద్ద గల సర్వే నంబర్‌ 189భూమిలో జేసీబీ ద్వారా అక్రమంగా మొరం తవ్వకాలను పి.రాజు(సోడల రాజు)అనే వ్యక్తి చేస్తున్నాడని వీడీసీ సభ్యులు అక్టోబరు 28న ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. రెవెన్యూ, భూగర్భ శాఖాధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి అక్రమ మొరం తవ్వకాలు జరుపుతున్నట్లు పంచనామా చేశారు. అ నంతరం నవంబరు 10న సోడాల రాజుకు అధికారులు నోటీసులు జారీ చేశారు. గ డుపు లోపు సమాధానం ఇవ్వనందున జరిమానాను 15 రోజుల లోపు చెల్లించాల్సిందిగా నోటీసులు జారీ చేశారు.

Updated Date - 2022-11-30T00:24:27+05:30 IST