సోషల్ మీడియా ప్రచారాలపై నిజామాబాద్ కమిషనర్ వార్నింగ్
ABN , First Publish Date - 2022-03-22T18:15:37+05:30 IST
ధన్ వివాదం నేపథ్యంలో సోషల్ మీడియా ప్రచారాలపై నిజామాబాద్ కమిషనర్ నాగరాజు వార్నింగ్ ఇచ్చారు.
నిజామాబాద్: బోధన్ వివాదం నేపథ్యంలో సోషల్ మీడియా ప్రచారాలపై నిజామాబాద్ కమిషనర్ నాగరాజు వార్నింగ్ ఇచ్చారు. కొంతమంది వ్యక్తులు శాంతిభద్రతలకు భంగం కలిగే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారని తెలిపారు. అటువంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడే వ్యక్తులపై కఠినంగా వ్యవహరిస్తూ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు సీపీ నాగరాజు మీడియాకు ప్రకటన విడుదల చేశారు.