కప్పర్లలో చిరుత కలకలం
ABN , First Publish Date - 2022-05-15T06:39:37+05:30 IST
మండంలోని కప్పర్ల గ్రామంలో చిరు త పులి కలకలం రేపింది. శనివారం ఉదయం హార్వెస్టర్ తో జొన్న పంటను కోస్తుండగా ఒక్కసారిగా చిరుత దా డి చేసేందుకు యత్నించింది.
తాంసి, మే 14 : మండంలోని కప్పర్ల గ్రామంలో చిరు త పులి కలకలం రేపింది. శనివారం ఉదయం హార్వెస్టర్ తో జొన్న పంటను కోస్తుండగా ఒక్కసారిగా చిరుత దా డి చేసేందుకు యత్నించింది. దీంతో రైతులు పరుగులు తీశారు. ఈ విషయం గ్రామస్థులకు తెలపడంతో గ్రామానికి చెందిన వందలాది మంది రైతులు కర్రల, కత్తులతో చిరుతను అడవిలోకి తరిమికొట్టారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు చిరుత కోసం గాలించారు. గ్రామ సమీపంలోకి చిరుత రావడంతో రైతులు పొలం పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు.