Kamareddyలో షార్ట్సర్క్యూట్తో ఇళ్లు దగ్ధం
ABN , First Publish Date - 2022-02-23T15:18:54+05:30 IST
జిల్లాలోని సదాశివనగర్ మండలం ధర్మారావు పేట గ్రామానికి చెందిన కారంగుల లక్ష్మీ అనే మహిళ ఇల్లు షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది.
కామారెడ్డి: జిల్లాలోని సదాశివనగర్ మండలం ధర్మారావు పేట గ్రామానికి చెందిన కారంగుల లక్ష్మీ అనే మహిళ ఇల్లు షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. ప్రమాదం జరిగినప్పుడు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఇంట్లోని సామాగ్రి కాలి బూడిదయ్యాయి. సుమారు లక్ష రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.