నేర రహిత జిల్లాగా మార్చడానికి కృషి : సీపీ

ABN , First Publish Date - 2022-03-05T06:08:21+05:30 IST

నిజామాబాద్‌ను రహిత జిల్లాగా మార్చడానికి ఉత్సాహంగా కృషి చేస్తానని, పోలీసు కమిషనర్‌గా ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానని సీపీ నాగరాజు అ న్నారు.

నేర రహిత జిల్లాగా మార్చడానికి కృషి : సీపీ


ఖిల్లా, మార్చి 4 :
నిజామాబాద్‌ను రహిత జిల్లాగా మార్చడానికి ఉత్సాహంగా కృషి చేస్తానని, పోలీసు కమిషనర్‌గా ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానని సీపీ నాగరాజు అ న్నారు. శుక్రవారం తన జన్మదిన వేడుకలను ఆయన చాంబర్‌లో ఆయా డివిజన్ల పోలీసు సిబ్బందితో ఘనంగా జరుపుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల సహకారం ఉంటేనే నేరాల నియంత్రణకు కృషి చేయవచ్చన్నారు. నేరాల నియంత్రణ కోసం పోలీసులతో పాటు ప్రజలు కూడా పోలీసులుగా స్పందించి సహరంచాలన్నారు. సిబ్బంది విధి నిర్వహణలో నిరంతరం పోరాటం చేసేలా విధులు నిర్వహిస్తున్నారన్నారు.  డీఐజీ క్యాంపు కార్యాలయంలో సిబ్బంది సైతం సీపీ బర్త్‌డే ఏర్పాట్లు చేశారు. తనను కలువడానికి విచ్చేసిన సిబ్బందితో పాటు ప్రజలకు ఆయన పేరు పేరున ధన్యావాదాలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు అరవింద్‌బాబు, డాక్టర్‌ వినిత్‌, లాఅండ్‌ఆర్డర్‌ ఉషావిశ్వనాథ్‌తిరునగరి, నిజామాబాద్‌ ఏసీపి. ఏ.వెంకటేశ్వర్‌, సీసీఎస్‌. ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌, నగర సీఐ కృష్ణా, ఎస్‌ఐలు పూర్ణేశ్వర్‌, సాయినాథ్‌, సందీప్‌లతో పాటు కార్యాయల సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-03-05T06:08:21+05:30 IST