చికోటి చిట్టాలో మనోళ్లు!
ABN , First Publish Date - 2022-08-07T06:24:38+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న చికోటి ప్రవీణ్ విదేశాలలో నిర్వహించే క్యాసినో, హవాలా రూపంలో కోట్లలో లావాదేవిలు జరుపుతున్నడనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నిఘా పెట్టి దర్యా ప్తు చేస్తొంది. అయితే చికోటి ప్రవీణ్తో దేశవ్యాప్తంగానే కాకుండా తెలంగాణలో పలువురు ప్రజాప్రతినిధులు,
ఉమ్మడి నిజామాబాద్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధాలు
నిజామాబాద్, కామారెడ్డిలోని పలువురు ముఖ్యనేతలతోనూ లావాదేవీలు
చికోటి ప్రవీణ్ వాట్సాప్ చాటింగ్లో గుర్తించిన ఈడీ
సదరు ఎమ్మెల్యేలు, నేతలకు ఈడీ నోటిసులు
రేపు విచారణకు రావాలంటూ ఆదేశించినట్లు సమాచారం
చికోటితో జిల్లానేతల సంబంధాలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ
జల్సాలు, జూదం ఆడేందుకు కోట్లలోనే లావాదేవీలు జరిపినట్లు ఆరోపణలు
ఇందుకు సదరు నేతలు గోవాతో పాటు విదేశాలకు వెళ్తూ.. వస్తుంటారంటూ ప్రచారం
కామారెడ్డి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న చికోటి ప్రవీణ్ విదేశాలలో నిర్వహించే క్యాసినో, హవాలా రూపంలో కోట్లలో లావాదేవిలు జరుపుతున్నడనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నిఘా పెట్టి దర్యా ప్తు చేస్తొంది. అయితే చికోటి ప్రవీణ్తో దేశవ్యాప్తంగానే కాకుండా తెలంగాణలో పలువురు ప్రజాప్రతినిధులు, నేత లు, వ్యాపారవేత్తలకు లావాదేవిల్లో సత్ససంబంధాలపై రాజకీ య వర్గాల్లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణలో 12మంది ఎమ్మెల్యేలతో పాటు కొందరు మంత్రులకు సంబంధాలు ఉన్నట్లు చిట్టాను ఈడీ సిద్ధం చేసింది. చికోటి చిట్టాలో ఉమ్మడి నిజామాబాద్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలకు క్యాసినో నిర్వహణలో ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు ఈడీ ప్రాథమిక విచారణలో తెలినట్లు సమాచారం. ఈ ఇద్దరి ఎమ్మెల్యెలకు ఈడీ ఇప్పటికే నోటిసులు జారిచేయడంతో పాటు సోమవారం విచారణకు ఈడీ కార్యాలయానికి రావాలని ఆదేశించినట్లు తెలిసింది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలే కాకుండా నిజామాబాద్తో పాటు కామారెడ్డి పట్టణానికి చెందిన పలువురు ద్వితియశ్రేణి ముఖ్యనేతలు చికోటి ప్రవీణ్ క్యాసినో లావాదేవీలలో హవాలా రూపంలో నగదు బదిలీ చేసినట్లు ఈడీ గుర్తించినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులు, నేతలతో చికోటి ప్రవీణ్ తో ఉన్న సంబంధాలపై జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చసాగుతోంది.
వాట్సాప్ చాటింగ్ ద్వారా గుర్తించిన ఈడీ
విదేశాలలో క్యాసినో నిర్వహించే చికోటి ప్రవీణ్ కేసు దర్యాప్తు ఈడీ ముమ్మరం చేసింది. సినిప్రముఖులతో పాటు పలు పార్టిలకు చెందిన ప్రజాప్రతినిధులు, బడా వ్యాపారులతో చికోటి ప్రవీణ్ విదేశాలలో విందు,వినోదాల పేరుతో క్యాసినో, జూదం లాంటివి నిర్వహిస్తుంటాడు. వీరిని తరుచూ విదేశాలకు తీసుకె ళ్లూ.. క్యాసినో నిర్వహిస్తు ఆ ముసుగులో హవాలా రూపంలో కోట్ల రూపాయల లో నగదు బదిలీ చేస్తున్నాడనే ఆరోపణలతో ఈడీ చికోటి ప్రవీణ్పై కేసు నమోదుచేసి విచారణ చేపడుతోంది. ఇందులో భాగంగానే చికోటి ప్రవీణ్తో సత్ససంబంధాలు ఉన్న ప్రజాప్రతినిధులు, సీనిప్రముఖులు, బడావ్యాపారులపై ఆరా తీసింది. హవాలా రూపంలో నగదు బదిలి చేయడంపై చికోటి ప్రవీణ్ వాట్సాప్ చాటింగ్ను ఈడీ సేకరించింది. ఇందులో తెలంగాణలోని 12 మంది ఎమ్మెల్యెలతో పాటు పలువురు మంత్రులు, మరికొందరు బడావ్యాపారులు క్యాసినో నిర్వహణలో కోట్లలోనే హవాలా రూపంలో చికోటిప్రవీణ్కు నగదు బదిలి చేసినట్లు తెలుస్తొంది. చికోటితో వాట్సాప్ చాటింగ్ చేసిన 12 మంది ఎమ్మెల్యెలో ఉమ్మడి నిజామాబాద్కు చెందిన ఎమ్మెల్యేలకు ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఆరా తీస్తున్న ట్లు సమాచారం. అయితే, సదరు ఈ ఎమ్మెల్యేలు ఎవరనే దానిపై ఉమ్మడి జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
క్యాసినో ఆడేందుకు విదేశాలకు నేతలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం పేకాటను పూర్తిగా నిర్మూలించింది. పేకాట ఆడేందుకు ఉమ్మడి జిల్లాలకు చెందిన పలువురు జూదరులు, రాజకీయ నేతలు బడా వ్యాపారులు పోరుగు రాష్ట్రాలతో పాటు గోవా లాంటి ప్రాంతాలకు వెళ్తూ.. రూ.లక్షల్లో లావాదేవీలు జరుపుతుంటారు. క్యాసినో లాంటి జూదం దేశంలో అనుమతి లేకపోవడంతో దీనికి అలవాటు పడిన బడా వ్యాపారులు, ప్రజాప్రతినిధులు అప్పుడప్పుడువిదేశాలతో పాటు గోవాకు వెళ్తుంటారు.క్యాసినో ముసుగులో కోట్లలో నగదును హవాలా రూపంలో లావాదేవిలు జరుపుతుంటారు. దేశంలో పర్యటక స్థలంగా ఉన్న గోవాలో మాత్రమే క్యాసినోకు అను మతి ఉన్నట్లు తెలుస్తుంది. గోవాతో పాటు శ్రీలంక, సింగపూర్ నేపాల్ లాంటి దేశాలకు క్యాసినో ఆడేందుకు ఉమ్మడి నిజామాబాద్ నుంచి చాలామంది నేతలు, బడావ్యాపారులు వెళ్తుంటారు. ప్రధానంగా వీకెండ్ సమయంలో క్యాసినో నిర్వహణ కోసం వెళ్తూ.. లక్షలు, కోట్ల రూపాయలలోనే నగదు లావాదేవీలు జరుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లోనే కాకుండా బడా వ్యాపారవర్గాలలోను చర్చసాగుతోంది. నిజామాబాద్ నగరం కామారెడ్డి, బాన్సువాడ పట్టణానికి చెందిన పలువురు నేతలు బడావ్యాపారులతో కలిసి తరచూ గోవా, శ్రీలంక, సింగపూర్,నేపాల్కు వెళ్తు క్యాసినోలో కోట్లలోనే హవాలా రూపంలో లావాదేవిలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. క్యాసినో నిర్వహకుడు చికోటి ప్రవీణ్కు ఉమ్మడి జిల్లాల నుంచి పలువురు ఏజెంట్లుగా, కస్టమర్లుగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.