TS News: ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో కీలక అంశాలు..

ABN , First Publish Date - 2022-08-04T16:17:35+05:30 IST

టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం అంశంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

TS News: ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో కీలక అంశాలు..

హైదరాబాద్ (Hyderabad): టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (MLA Jeevan reddy) పై హత్యాయత్నం అంశంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రసాద్ గౌడ్‌ (Prasad Goud)తోపాటు మరికొందరిపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. విచారణలో భాగంగా పోలీసులు ప్రసాద్ గౌడ్ నుంచి కీలక సమాచారం రాబట్టారు. ఆర్మూర్ ఎమ్మెల్యే మీద హత్యాయత్నం సంచలనంగా మారింది. 


నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్యకు కుట్ర కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దగాని ప్రసాద్‌ గౌడ్‌ను ఏ-1గా, ఆయన భార్య, మాజీ సర్పంచ్‌ లావణ్యను ఏ-2గా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. వీరిపై 452, 120బి, 506, 307 తదితర సెక్షన్‌ల కింద బంజారాహిల్స్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. హత్య పూరిత కుట్ర, అక్రమ ఆయుధాల నిల్వలు, ఆయుధాల క్రయవిక్రయాలు వంటి కేసులను నమోదు చేశారు. కాగా, ఈ కేసుపై పలురకాల వాదనలు వినిపిస్తున్నాయి. ప్రసాద్‌ తన తలకు పిస్తోలు పెట్టి బెదిరించాడని జీవన్‌రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోపక్క, ప్రసాద్‌ సంబంధిత భవనంలోని మూడో అంతస్తుకు వెళ్లినప్పుడు అతని చేతిలో పిస్తోలు లేదని జీవన్‌రెడ్డి అనుచరులు చెబుతున్నారు. పిస్తోళ్లు మాత్రం ప్రసాద్‌ కారులో లభించాయని పలువురు అంటున్నారు.

Updated Date - 2022-08-04T16:17:35+05:30 IST