వసతిగృహాల్లో మరమ్మతులను వేగవంతం చేయండి
ABN , First Publish Date - 2022-05-18T06:45:29+05:30 IST
సంక్షేమ వసతిగృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా చేపడుతున్న నిర్మాణాలు, ఇతర మరమ్మతు పనులను వేగవంతం చేస్తూ సకాలంలో పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ప్రగతిభవన్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు, ఇంజనీరింగ్ విభా గం అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా
నిజామాబాద్ అర్బన్, మే 17: సంక్షేమ వసతిగృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా చేపడుతున్న నిర్మాణాలు, ఇతర మరమ్మతు పనులను వేగవంతం చేస్తూ సకాలంలో పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ప్రగతిభవన్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు, ఇంజనీరింగ్ విభా గం అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ హాస్టల్లో తప్పనిసరిగా తాగునీరు, నీటి వసతితో కూడిన టాయిలెట్స్ అందుబాటులో ఉండేలా చూడాలని విద్యుదీకరణ సంబంధిం చి కూడా ఏ చిన్న ఇబ్బంది లేకుండా పనులు జరిపించాలన్నారు. జూన్ 12 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నందున జూన్ 5వ తేదీలోపే పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. నాణ్యతా లోపాలకు తావులేకుండా పనులు జరగాలని మరమ్మత్తు పనులకు సంబంధించి నిధు లు సిద్ధంగా ఉన్నాయని, పనులు పూర్తయిన వెంటనే బిల్లులు చెల్లించడం జరుగుతుందన్నారు. ప్రతీ వసతిగృహాన్ని అవసరమైన అన్ని వసతులతో తీర్చిదిద్దాలని హాస్టల్లలో పూర్తిస్థాయి విద్యార్థులు అడ్మిషన్లు పొందేలా సమష్టిగా కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టడీ సర్కిల్లలో నిరుద్యోగ అభ్యర్థులకు అందిస్తున్న ఉచిత శిక్షణ గురించి కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసు ఉద్యోగాలతో పాటు గ్రూప్ ఎగ్జామ్స్ కోసం అందిస్తున్న ఉచిత శిక్షణకు వివిధ కారణాల వల్ల కొంతమంది అభ్యర్థులు హాజరుకావడంలేదని సంక్షేమ అధికారులు తెలపగా అర్హులైన ఇతర అభ్యర్థులను నిర్ణీత సీట్ల సంఖ్యకు అనుగుణంగా ప్రవేశాలు కల్పించాలన్నారు. శిక్షణ తరగతుల్లో పూర్తిస్థాయిలో అభ్యర్థులు ఉండాలని, అభ్యర్థులు కోరుకున్న మెటిరియల్ సేకరించి తక్షణమే అందించాలన్నారు. ఈ సమావేశంలో వివిధ సంక్షేమ శాఖల అధికారులు శశికళ, నర్సయ్య, నాగోరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.