యాదాద్రిలో రెండో రోజుకు వార్షిక బ్రహ్మోత్సవాలు
ABN , First Publish Date - 2022-03-05T13:50:42+05:30 IST
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు రెండో రోజు కొనసాగుతున్నాయి.
యాదాద్రి: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం ధ్వజారోహణం, సాయంత్రం బేరిపూజ, దేవతాహ్వానాన్ని అర్చకులు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు.