కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా
ABN , First Publish Date - 2022-08-08T06:51:11+05:30 IST
కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీలోకి వెళ్లినా తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు వడ్డేపల్లి రవి స్పష్టం చేశారు.
తుంగతుర్తి, ఆగస్టు 7: కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీలోకి వెళ్లినా తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు వడ్డేపల్లి రవి స్పష్టం చేశారు. ఆదివారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు సానుభూతిపరులు మృతిచెందటంతో వారి కుటుం బాలను పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో బలంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటా మన్నారు. గత ఎన్నికల్లో ఎమ్మేల్యే గాదరి కిశోర్కుమార్, కాంగ్రెస్ అభ్యర్ధి అద్దంకి దయాకర్ వద్ద తాను డబ్బులు తీసుకున్నానని కొందరు ఆరోపి స్తున్నారని, దీనిని నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కృషిచేయాలన్నారు. నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటానన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు నరేందర్, రమేష్, రవి, వినోద్, లింగయ్య, విక్రమ్ పాల్గొన్నారు.