ప్రగతి భవనను ముట్టడిస్తాం: టీఎనఎస్ఎఫ్
ABN , First Publish Date - 2022-12-31T00:26:48+05:30 IST
ఫీజురీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేకుంటే ప్రగతి భవనను ముట్టడిస్తామని టీఎనఎ్సఎ్ఫ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్, నంబూరి సూర్యం అన్నారు. విద్యా
కోదాడ, డిసెంబరు 30 : ఫీజురీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేకుంటే ప్రగతి భవనను ముట్టడిస్తామని టీఎనఎ్సఎ్ఫ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్, నంబూరి సూర్యం అన్నారు. విద్యా రంగ వ్యవస్థపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ శుక్రవారం కోదాడలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆర్డీవో కిషోర్కుమార్కు వినతిపత్రం అందజేశారు. రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న రూ.3300 కోట్ల బకాయిలను విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ కోదాడ పట్టణ అధ్యక్షుడు ఉప్పగండ్ల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి పిడతల శ్రీనివాసరావు, టీఎనఎ్సఎ్ప రాష్ట్ర ఉపాధ్యాక్షుడు బొల్లికొండ సైదులు, మహేష్, బోస్, నాగరాజు, శోభన సందీప్ పాల్గొన్నారు.