వడ్డెర కులస్థులను ఆదుకోవాలి: లక్ష్మమ్మ

ABN , First Publish Date - 2022-04-28T06:40:12+05:30 IST

వడ్డెర కులస్థులను ప్రభుత్వం ఆదుకోవాలని వడ్డెర సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శివరాత్రి లక్ష్మమ్మ కోరారు.. బుధవారం మండల కేంద్రంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ కాయ కష్టం చేసుకుని జీవించే వడ్డెరులకు రాష్ట్ర బడ్జెట్‌లో రూ.3కోట్లు మాత్రమే కేటాయించడం సరికాదన్నారు.

వడ్డెర కులస్థులను ఆదుకోవాలి: లక్ష్మమ్మ

వలిగొండ, ఏప్రిల్‌ 27: వడ్డెర కులస్థులను ప్రభుత్వం ఆదుకోవాలని వడ్డెర సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శివరాత్రి లక్ష్మమ్మ కోరారు.. బుధవారం మండల కేంద్రంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ  కాయ కష్టం చేసుకుని జీవించే వడ్డెరులకు రాష్ట్ర బడ్జెట్‌లో రూ.3కోట్లు మాత్రమే కేటాయించడం సరికాదన్నారు. జనాభా ప్రాతిపదికన వడ్డెరులకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. బ్యాంకు రుణాలు ఇవ్వాలని, గురుకులాల్లో తగిన సీట్లు కేటాయించాలని, అర్హులందరికీ రూ.5వేల పెన్షన్‌ ఇవ్వాలని,  క్రషర్‌ వాహనాలకు ఉచితంగా లైసెన్సులు ఇవ్వాలని,  డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లతో పాటు ప్రతీ కుటుంబానికి ఒక ఎకరం భూమి ఇవ్వాలన్నారు. సమావేశంలో వడ్డెర సంఘం మండల అధ్యక్షుడు గొలు సుల నర్సింహ, నాయకులు ఆలకుంట్ల కృష్ణ పాల్గొన్నారు. 

Updated Date - 2022-04-28T06:40:12+05:30 IST