మంత్రి హరీ్షరావు స్ఫూర్తితో పట్టణ నిద్ర: డీఎంహెచవో
ABN , First Publish Date - 2022-06-30T06:39:35+05:30 IST
తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి ఆదేశాల మేరకు పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా.మల్లికార్జునరావు బుధవరాం పట్టణ నిద్ర కార్యక్రమం నిర్వహించారు.
భూదానపోచంపల్లి, జూన 29: తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి ఆదేశాల మేరకు పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా.మల్లికార్జునరావు బుధవరాం పట్టణ నిద్ర కార్యక్రమం నిర్వహించారు. రాత్రి 8-45 గంటలకు పీహెచసీ చేరుకున్న డీఎంహెచవో స్థానిక పీహెచసీ వైద్యాధికారి డా.యాదగిరి, సిబ్బందితో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సదుపాయాలపై చర్చించారు. అనంతరం మండల పరిధిలోని ఆరోగ్య కార్యకర్తలు, ఆశ వర్కర్ల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని రోగులకు రోజుకు 24 గంటల పాటు వైద్య సేవలు అందించేందుకు వైద్యసిబ్బంది కృషి చేయాలని కోరారు. అనంతరం డీఎంహెచవో ఆసుపత్రిలోనే నిద్రించారు. కార్యక్రమాల్లో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ప్రశాంత, డాక్టర్ సుమన కల్యాణ్, మండల వైద్యాధికారి డాక్టర్ యాదగిరి, పల్లె దవాఖానా డాక్టర్ ఉమారాణి, సూపర్వైజర్లు అరుంధతి, ఉమ, ఆరోగ్య కార్యకర్తలు భవాని, వాణి, లత, లక్ష్మన, బేగ్, గోపాల్రావు పాల్గొన్నారు.