టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి : రాజగోపాల్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-08-19T05:45:56+05:30 IST

కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి : రాజగోపాల్‌రెడ్డి
సమావేశంలో మాట్లాడుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

చౌటుప్పల్‌ రూరల్‌, ఆగస్టు 18: కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఎల్లగిరి గ్రామంలో నిర్వహించిన బీజేపీ మండల ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంతోమందికి దానం చేసిన తాను డబ్బుల కోసం పార్టీ మారినట్టు విషపుప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మునుగోడు అభివృద్ధి కోసమే పార్టీ మారానని అన్నారు. అమిత్‌షా సభకు భారీగా ప్రజలు తరలిరావాలని కోరారు. సమావేశంలో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి, మాజీ ఎమ్మెల్యే ఎంవీఎస్‌ ప్రభాకర్‌, నాయకులు కడగంచి రమేష్‌, రమనగోని శంకర్‌, దూడల బిక్షంగౌడ్‌, చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, రిక్కల సుధాకర్‌రెడ్డిలు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-19T05:45:56+05:30 IST