ముత్తయ్య ఆత్మహత్యకు కారకులైన వారిని అరెస్టు చేయాలి
ABN , First Publish Date - 2022-08-11T06:25:45+05:30 IST
గాదె ముత్తయ్య ఆత్మహత్యకు కారకులైన వారిని త క్షణమే అరెస్టు చేయాలని దోమలపల్లి గ్రామస్థులు డిమాండ్ చేశారు.
రూరల్ పోలీస్స్టేషన ఎదుట ధర్నా, రాస్తారోకో
నల్లగొండ, ఆగస్టు 10: గాదె ముత్తయ్య ఆత్మహత్యకు కారకులైన వారిని త క్షణమే అరెస్టు చేయాలని దోమలపల్లి గ్రామస్థులు డిమాండ్ చేశారు. బుధవా రం నల్లగొండ రూరల్ పోలీ్సస్టేషన ఎదుట ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. వారికి కాంగ్రెస్, బీఎస్పీ నాయకులు మద్దుతు తెలిపారు. ప్రభుత్వం అందజేసిన ఇందిరమ్మ ఇంటిని కొంతమంది కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని, దీనికి తోడు కులం పేరుతో దూషించి అక్రమ కేసులు బనాయించడంతో ముత్తయ్య ఆత్మహత్య చేసుకున్నాడని పలువురు నాయకులు పేర్కొన్నారు. పోలీసులు సివి ల్ మ్యాటర్లో జోక్యం చేసుకున్నారని ఆ గ్రామానికి చెందిన దళిత కుటుంబాలు ఆరోపించాయి. అధికార పార్టీకి చెందిన నాయకుల ఒత్తిడి వల్లనే ఈ ఘటన చోటుచేసుకుందని ఆరోపించారు. ముత్తయ్య మృతికి కారకులైన వారిని అరెస్టు చేయాలని ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహనరెడ్డి, జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, నా యకులు కార్తీక్, నాగరాజు పాల్గొన్నారు. నిందితులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బీఎస్పీ నాయకులు శ్రీనివాస్, కార్తీక్, శివరామకృష్ణ డిమాండ్ చేశారు.