నడిగూడెంలో దాహం..దాహం
ABN , First Publish Date - 2022-12-08T01:21:17+05:30 IST
నడిగూడెం మండల కేంద్రంలోని తొమ్మిదో వార్డులో మంచినీటికి కటకట ఏర్పడింది.
నడిగూడెం, డిసెంబరు 7: మండల కేంద్రంలోని తొమ్మిదో వార్డులో మంచినీటికి కటకట ఏర్పడింది. నాలుగు రోజుల క్రితం లోవోల్టేజీతో గ్రామపంచాయతీ బోరు మోటారు కాలిపోయింది. మోటర్కు మరమ్మతు చేయించకపోవడంతో సరఫరా నిలిచిపోయింది. దీంతో మంచినీటి ఎద్దడి ఏర్పడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేయడంతో సర్పంచ్ గడ్డం నాగలక్ష్మీమల్లే్షయాదవ్ పంచాయతీ ట్యాంకర్ ద్వారా ఇంటింటికీ మంచినీటిని సరఫరా చేస్తున్నారు. ట్యాంకర్ ద్వారా అందించే నీరు అవసరాలకు సరిపోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. విద్యుత్ లోవేల్టేజీ సమస్యతో మోటర్లు తరుచూ కాలిపోయి మంచినీటి సమస్య ఏర్పడుతోందని,గ్రామానికి ప్రత్యేకంగా ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయాలని గ్రామస్థులు కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కొత్త మోటారు అమర్చి వార్డులో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు.