మునుగోడును పట్టించుకోని గత పాలకులు
ABN , First Publish Date - 2022-08-20T06:27:53+05:30 IST
కాంగ్రెస్, బీజేపీ పాలకులు మును గోడును పట్టించుకోలేదని, తమ హయాంలోనే అభివృద్ధి చెందుతోందని మంత్రి జగదీష్రెడ్డి అన్నారు.
మంత్రి గుంతకండ్ల జగదీష్రెడ్డి
మర్రిగూడ, చండూరు, ఆగస్టు 19: కాంగ్రెస్, బీజేపీ పాలకులు మును గోడును పట్టించుకోలేదని, తమ హయాంలోనే అభివృద్ధి చెందుతోందని మంత్రి జగదీష్రెడ్డి అన్నారు. శుక్రవారం నాంపల్లి మండలంలోని పసునూరు గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. అదేవిధంగా చండూరులో కార్యక ర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. స్వార్థ రాజకీయాల కోసమే బీ జేపీతో రాజగోపాల్ జతకట్టి రాజీనామా చేశాడని ఆరోపించారు. సీఎం కేసీఆర్ వ ల్లే నియోజకవర్గం ఫ్లోరైడ్ నుంచి విముక్తి పొందిదన్నారు. అంతకుముందు ప సునూరు, చామలపల్లి, రంగ్యాతండాలోని పలువురు టీఆర్ఎస్లో చేరారు. ఆ యా కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే రవీంద్రకుమార్, ఎంపీపీ ఏ డుదొడ్ల శ్వేత రవీందర్రెడ్డి, జడ్పీటీసీ కేవిరెడ్డి, వైస్ఎంపీపీ వెంకన్న, నర్సింహా రా వు తదితరులు పాల్గొన్నారు.