సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-03-16T05:37:35+05:30 IST

కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28, 29వ తేదీల్లో నిర్వహించే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ నాయకుల కోరారు. నల్లగొండ పట్టణంలోని పవర్‌లూమ్‌ వివర్స్‌ అసోసియేషన్‌ నాయకులకు సీఐటీయూ ఆధ్వర్యంలో సమ్మె నోటీసును మంగళవారం అందజేశారు. సీఐటీయూ నాయుడు దండెంపల్లి సత్తయ్య మాట్లా డు

సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి

నల్లగొండ రూరల్‌/ దామరచర్ల/, మార్చి 15: కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28, 29వ తేదీల్లో నిర్వహించే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ నాయకుల కోరారు. నల్లగొండ పట్టణంలోని పవర్‌లూమ్‌ వివర్స్‌ అసోసియేషన్‌ నాయకులకు సీఐటీయూ ఆధ్వర్యంలో సమ్మె నోటీసును మంగళవారం అందజేశారు. సీఐటీయూ నాయుడు దండెంపల్లి సత్తయ్య మాట్లా డుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానం, కనీస వేతనాల చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం యజమానులకు అనుకూలంగా మార్పులు చేస్తోందన్నారు.  కార్యక్రమంలో గంజి నాగరాజు, రాములు, సత్యనారయణ పా ల్గొన్నారు. దారమర్లచర్లలో జరిగిన ఐక్య కార్మిక సంఘాల రౌండ్‌టేబుల్‌ సమావేశం లో సీఐటీయూ మండల కన్వీనర్‌ దయానంద్‌ మాట్లాడారు. కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలన్నారు. గాజుల శ్రీనివాస్‌ అధ్యక్షతన జరి గిన కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌కేవి నాయకులు జానకిరాములు, సీపీఐ నాయకులు లింగానాయక్‌, కోటయ్య, ఎస్‌కె.బాబా, నాగయ్య, సైదులు, జాని పాల్గొన్నారు. చిట్యాలలో జరిగిన సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నారబోయిన శ్రీనివాస్‌ మాట్లాడారు. కనీస వేతనం రూ.27వేలు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో ఏనుగు వెంకట్‌రెడ్డి, బాకీ అండాలు, కృపమ్మ, ధనలక్ష్మి, అలివేలు పాల్గొన్నారు.


Updated Date - 2022-03-16T05:37:35+05:30 IST