తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం : ఎంపీ
ABN , First Publish Date - 2022-01-17T06:53:01+05:30 IST
సీఎం ముఖ్యమంత్రి అమలు చే స్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయ ని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు.
నల్లగొండ, జనవరి 16: సీఎం ముఖ్యమంత్రి అమలు చే స్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయ ని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని యాదవ సంఘం భవనంలో ఆదివారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన చైర్మనగా ఎ న్నికైన దూదిమెట్ల బాలరాజ్యాదవ్ సన్మాన సభకు ఆయన ము ఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాలకు టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే సరైన ప్రాధాన్యత ఉందని అ న్నారు. కార్పొరేషన చైర్మన దుదిమెట్ల బాలరాజు మాట్లాడుతూ తె లంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా ఎన్నో కేసులు ఎదుర్కొన్నానని అన్నారు. ముఖ్యమంత్రి కార్పొరేషనకు చైర్మనగా నియమించి యాదవ జాతికి సేవచేసే అవకాశాన్ని కల్పించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అనంతరం బాల్రాజ్ను యాదవ సంఘం నాయకులు, ఉద్యోగులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు లొడంగి గోవర్ధన అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన వట్టె జానయ్య, యాదవ సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు బొబ్బిలి గోపాలకృష్ణ, త రాల పరమేష్, చీర పంకజ్యాదవ్, శ్రీనివా్సయాదవ్, దూదిమెట్ల సత్తయ్య, ఏడుకొండలు, కన్నెబోయిన జ్యోతి, రేణుక, మామిడి ప ద్మ, ఆవుల రామన్న, పర్వతాలు, ఎడ్ల శ్రీనివాస్, పిల్లి రామరాజు, వంగూరి నారాయణ తదితరులు పాల్గొన్నారు.