శ్రీవల్లి టౌన్‌షి్‌ప ఓపెన్‌ ప్లాట్‌ గజం ధర రూ.7వేలు

ABN , First Publish Date - 2022-03-07T06:44:30+05:30 IST

రాజీవ్‌ స్వగృహ శ్రీవల్లి టౌన్‌షి్‌ప ఓపెన్‌ ప్లాట్ల చదరపు గజం కనీస ధరను రూ.7వేలుగా నిర్ణయించారు. ఓపెన్‌ ప్లాట్ల వేలంపై కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య

శ్రీవల్లి టౌన్‌షి్‌ప ఓపెన్‌ ప్లాట్‌ గజం ధర రూ.7వేలు
కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌

నల్లగొండ టౌన్‌, మార్చి 6: రాజీవ్‌ స్వగృహ శ్రీవల్లి టౌన్‌షి్‌ప ఓపెన్‌ ప్లాట్ల చదరపు గజం కనీస ధరను రూ.7వేలుగా నిర్ణయించారు. ఓపెన్‌ ప్లాట్ల వేలంపై కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవనంలో సోమవారం ఉదయం 10గంటలకు మూడో ప్రీబిడ్‌ సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో రాజీవ్‌ స్వగృహ శ్రీవల్లి టౌన్‌షి్‌పలో 240ఓపెన్‌ ప్లాట్లను వివిధ విస్తీర్ణంలో ఉన్న వాటిని వేలం ద్వారా మార్చి 14,15,16,17వ తేదీల్లో విక్రయించనున్నట్లు తెలిపారు. మొదట చదరపు గజానికి రూ.10వేలు అనుకున్నా, తర్వాత కనీస ధరను రూ.7వేలుగా నిర్ణయించారు.  

Updated Date - 2022-03-07T06:44:30+05:30 IST