క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకోవాలి
ABN , First Publish Date - 2022-08-17T06:32:45+05:30 IST
క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకోవాలని కలెక్టర్ హేమంత్ కేశవ్పాటిల్ అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను ఎస్పీ రాజేంద్రప్రసాద్తో కలిసి ప్రారంభించి మాట్లాడారు.

సూర్యాపేటఅర్బన్, ఆగస్టు 16: క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకోవాలని కలెక్టర్ హేమంత్ కేశవ్పాటిల్ అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను ఎస్పీ రాజేంద్రప్రసాద్తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో శారీరక దారుడ్యంతోపాటు మానసిక ప్రశాంతంత కలుగుతుందన్నారు. క్రీడాకారులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. క్రీడాకారులు పుట్టిన ఊరికి, కన్న తల్లిదండ్రులకు పేరుతేవాలన్నారు. విజేతలకు ఈనెల 18న బహుమతులు అందజే యనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ శ్రీనివా్సగౌడ్, జడ్పీ సీఈవో సురేష్, డీఎస్పీ నాగభూషణం, ఆర్డీవో రాజేంద్రకుమార్, డీఈవో అశోక్, పీడీ కిరణ్కుమార్, మునిసిపల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.