ప్రజల కలలను సాకారం చేసిన సోనియా
ABN , First Publish Date - 2022-12-10T01:36:27+05:30 IST
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ఎన్నో ఏళ్ల ప్రజల కలలను సోనియాగాంధీ సాకారం చేశారని, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్రెడ్డి అన్నారు.
ఆంధ్రజ్యోతి న్యూస్నెట్వర్క్, డిసెంబరు 9: తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ఎన్నో ఏళ్ల ప్రజల కలలను సోనియాగాంధీ సాకారం చేశారని, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్రెడ్డి అన్నారు. సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి భారీ కేక్ను కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ యువకుల బలిదానాలతో చలించిన సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారన్నారు. మత విద్వేషాలకు తావులేని విధంగా కాంగ్రెస్ పాలన సాగిందన్నారు. పేదల అభ్యున్నతికి కాంగ్రెస్ పెద్దపీట వేసిందన్నారు. త్యాగాలకు గాంధీ కుటుంబం ఆదర్శమని, మహిళా శక్తికి సోనియాగాంధీ నిదర్శనమని అన్నారు. రాబోయే ఎన్నికల్లో సోనియాగాంధీ, రాహుల్గాంధీ నాయ కత్వంలో కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమ న్నారు. కార్యక్రమంలో పట్టణ అఽధ్యక్షుడు అంజద్అలీ, చకిలం రాజేశ్వర్రావు, కక్కిరేణి శ్రీనివాస్, ముదిరెడ్డి రమణా రెడ్డి, షఫీవుల్లా, మాణిక్యం, గట్టు శ్రీను, నామా ప్రవీణ్, ఉపేందర్, వెంకన్న పాల్గొన్నారు.